Miss Switzerland Finalist Murder| ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కానీ ఆ గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటే ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది. కానీ కొన్నిసార్లు హింసాత్మక ఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటిదే ఒక ఘటనతో మిస్ స్విట్జర్లాండ్ అందాల పోటీల్లో ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ని ఆమె భర్త అతికృూరంగా హత్య చేశాడు. అయితే హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని దాచాలనే క్రమంలో రాక్షస ప్రయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. క్రిస్టినా జోక్సిమోవిక్ అనే మహిళ 2007 లో మిస్ నార్త్వెస్ట్ స్విట్జర్లాండ్ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరం మిస్ స్విట్జర్లాండ్ అందాల పోటీల్లో ఫైనల్ రౌండ్ వరకు చేరుకుంది. ఆ తరువాత ఆమె క్యాట్ వాక్ కోచ్ గా స్థిరపడింది. 2013 మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో మిస్ డొమినిక్ కు శిక్షణ కూడా ఇచ్చింది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 3500 ఫాలోవర్స్ ఉన్నారు.
అయితే క్రిస్టినా జోక్సిమోవిక్ 2017లో థామస్ అనే బిజినెస్ మెన్ ని వివాహం చేసుకుంది. ఇద్దరూ మంచి విలాసవంతమైన ఇంట్లో సంతోషంగా ఉండేవారు. చాలా దేశాల తిరుగుతూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా చేసేవారు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే జనవరి నెలలో క్రిస్టినా తల్లిదండ్రులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు క్రిస్టినా తన సోషల్ మీడియా అకౌంట్ లో తన భర్త తనను కొట్టాడని వీడియో కూడా పెట్టింది. ఆ సమయంలో పోలీసులు ఆమె భర్త థామస్ ను హెచ్చరించి వదిలేశారు.
Also Read: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని
కానీ కొన్ని రోజుల తరువాత నుంచి ఆమె కనిపించపోయేసరికి పోలీసులు క్రస్టినా మిస్సింగ్ కేసులో థామస్ ను విచారణ చేశారు. తనకేమీ తెలియదని ఆమె కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పాడు. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉంటుదని తాను ఇన్ని రోజులు భావించానని చెప్పాడు. వారిద్దరికీ ఇంట్లో గొడవ జరగడంతో ఇద్దరి మధ్య మాటలు లేవని అన్నాడు. థామస్ తెలివితో కథ అల్లేసరికి పోలీసులు కూడా నమ్మేశారు.
కానీ రెండు రోజుల తరువాత వారి ఇంటికి కొంత దూరంలో ఒక చెరువు వద్ద పోలీసులకు ఒక శవం లభించింది. అయితే ఆ శవం శరీర భాగాలు కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. ముఖ్యంగా శవం ముఖం సరిగా గుర్తించడానికి కష్టంగా ఉంది. దీంతో పోలీసులు శవానికి డీఎన్ఏ పరీక్ష చేశారు. మిస్సింగ్ కేసులన్నీ పరిశీలించి.. అది ఒక మహిళ శవం కావడంతో క్రిస్టినా మిస్సింగ్ కేసులో ఆమె తల్లిదండ్రుల డీఎన్ఏతో పోల్చి పరీక్షించారు. దీంతో ఆ శవం క్రిస్టీనాదే అని తేలిపోయింది. శవం పోస్టు మార్టం రిపోర్ట్ ప్రకారం.. క్రిస్టినా ను గొంతు నులిమి హత్య చేశారు. ఆ తరువాత శవాన్ని ముక్కలుగా నరికారు. శవంపై యాసిడ్ పోసినట్లు కూడా తేలింది. ఇదంతా శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా చేశారని పోస్ట్ మార్టం నిపుణలు తెలిపారు.
Also Read: ఏడాదిలో 9 మహిళలను చంపిన సైకో.. హత్యకు చిహ్నంగా లిప్ స్టిక్ తీసుకెళ్లే అలవాటు!
పోలీసులు క్రిస్టినా హత్య కేసులో ఆమె భర్తను అనుమానించి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో క్రిస్టినా భర్త థామస్.. తానే హత్య చేశానని అంగీకరించాడు. కానీ క్రిస్టినా తనపై దాడి చేయడానికి వస్తే ఆత్మరక్షణ కోసం తనే ఆమెను చంపేశానని తెలిపాడు. అయితే క్రిస్టినా చనిపోయాక తాను భయపడిపోయానని.. ఆమె చనిపోయిన సంగతి ఎవరికీ తెలియకూడదని శవాన్ని రంపంతో శరీరాన్నీ ముక్కలుగా నరికేశానని చెప్పాడు. ఆ తరువాత ఆమె శరీర భాగాలను మిక్సీ బ్లెండర్ లో వేసి తిప్పేశాను. అయినా ఎందుకో ఆ శవాన్ని ఎవరైనా గుర్తు పడతారని భావించి దానిపై యాసిడ్ పోసి ఊరి చివర చెరువు వద్ద పడేశానని అన్నాడు.
పోలీసులు థామస్ చెప్పినదంతా విని ఆశ్చర్యపోయారు. కోర్టులో విచారణ సందర్భంగా థామస్ తాను ఆత్మరక్షణలో భాగంగా క్రిస్టినాని హత్య చేశానని చెప్పాడు. కానీ ఫోరెన్సిక్ నిపుణులు, మానసిక వైద్య నిపుణల రిపోర్ట్ ప్రకారం.. థామస్ ఒక సైకో అని తేలింది. స్విట్జర్లాండ్ చట్టాల ప్రకారం.. థామస్ నేరాంగీకారం చేశాడు గనుక అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.