Attack on Dalit Women: మనిషి అంతరిక్షానికి కూడా అవలీలగా చేరుకునే రోజులు వచ్చాయి. కానీ కుల జాడ్యాన్ని విడనాడే రోజులు మాత్రం రావటం లేదు. నేటి ఆధునిక యుగంలోనూ కుల వివక్షకు సంబంధించిన ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దారుణం చోటు చేసుకుంది. దళిత మహిళ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టారు చాకలి సామాజికవర్గంవారు.
కల్లుకుంటలో ఆరు నెలల క్రితం ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వరుడు దళిత సామాజికవర్గానికి చెందిన యువకుడు కాగా.. వదువు చాకలి సామాజికవర్గానికి చెందిన యువతి. కులాంతర వివాహాన్ని ఆమోదించని గ్రామ పెద్దలు వరుడి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు.
Also Read: టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్.. కాకపోతే..
అయితే తాజాగా.. వరుడి తల్లి గోవిందమ్మ పని మీద కల్లుకుంట్ల గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో గ్రామంలోని వధువు బంధువులు గోవిందమ్మ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై చేయి చేసుకున్నారు. దళిత మహిళ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టారు చాకలి సామాజికవర్గంవారు. ఈ క్రమంలో దళిత, చాకలి సామాజికవర్గాల మధ్య తీవ్ర దాడులు, ప్రతి దాడులు జరిగాయి. కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
కొడుకు ప్రేమ వివాహం.. దళిత తల్లిని కొట్టిన వధువు బంధువులు
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంలో దారుణం.. దళితురాలు గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టిన వధువు బంధువులు. 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంటని గ్రామ బహిష్కరణ చేసిన ఊరి పెద్దలు.
కల్లుకుంట్ల వచ్చిన… pic.twitter.com/k6uC6gdwCY
— BIG TV Breaking News (@bigtvtelugu) September 13, 2024