High Tension at CP Office: సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కొండాపూర్ లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సీపీ ఆఫీస్ కు హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా సీపీ ఆఫీసు మెట్ల వద్ద కూర్చొని ఆందోళన చేస్తుండడంతో పోలీసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వినకుండా తమ ఆందోళనను ఉధృతం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇటు పాడి కౌశిరెడ్డి కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించసాగారు. అడ్డుకోబోయిన పోలీసుల పైకి వేలెత్తి చూపిస్తూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వెంటనే కలుగుజేసుకున్న హరీశ్ రావు.. పాడి కౌశిక్ రెడ్డికి సముదాయించి పక్కకు పంపించారు. అనంతరం ఆయన పోలీసులతో మాట్లాడారు. దీంతో సీపీ ఆఫీసు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది.
Also Read: హుటాహుటిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వెళ్లిన హరీశ్రావు.. ఇదేం పద్ధతంటూ..
ఇదిలా ఉంటే.. సీపీ అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సీపీకి వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.