Bengaluru-Prayagraj Train via Telangana: ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ మీదుగా ప్రయాగ్ రాజ్ – ఎస్ఎమ్వీటీ బెంగళూరు – ప్రయాగ్ రాజ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయాగ్ రాజ్ – ఎస్ఎమ్వీటీ బెంగళూరు ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 17 వరకు ప్రతి ఆదివారం, ఎస్ఎమ్వీటీ బెంగళూరు – ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ రైలు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు మొత్తం 12 సర్వీసులను కేటాయించి నడిపించనున్నట్లు తెలిపింది.
ఈ ప్రత్యేక రళ్లు మాణిక్ పూర్, సత్నా, కట్ని, జమల్ పూర్, ఇటార్సీ, నాగ్ పూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుందని వివరించింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే ఫ్యామిలీ!
ఇదిలా ఉండగా, రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అప్ అండ్ డౌన్ రూట్లో 12 రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు రైలు అధికారులు తెలిపారు.