EPAPER

Union Cabinet: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..

Union Cabinet: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..

Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు అంశాలపై చర్చింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్, డెసిషన్స్ వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్లు పైబడిన సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, 70 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారంతా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందొచ్చన్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 6 కోట్లకు పైగా సీనియర్ సిటిజన్స్ లబ్ధి పొందనున్నారన్నారు.


Also Read: మేము ఉన్నంత వరకూ.. దానిని టచ్ కూడా చేయలేరు : రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందన

ఇదిలా ఉంటే.. ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డును అందిస్తుంది. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి.


 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×