EPAPER

Praja Palana: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రజాపాలన దినోత్సవంగా..

Praja Palana: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రజాపాలన దినోత్సవంగా..

Telangana Government decided to hold the ‘Praja Palana’ Program: సెప్టెంబర్ 17.. ఈరోజు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. కొన్నేండ్ల సంవత్సరాల తరువాత నిజాం నిరంకుశత్వ పాలన నుంచి తెలంగాణ ఇదే రోజున.. అనగా 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్యంలో కలిసింది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అయితే, ఈ సెప్టెంబర్ 17న ప్రతీ ఏడాది కూడా తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా సెప్టెంబర్ 17 విషయంలో మాటల యుద్ధం తప్పడంలేదు. సెప్టెంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ వస్తున్నాయి.


ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలగాణ ప్రజాపాలన దినోత్సవం వేళ జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇటు 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.

Also Read: గాంధీ ఆసుపత్రిలో దారుణం.. వైద్యురాలిపై దాడి


అయితే, గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 నిర్వహణపై నెలకొన్న వివాదం గురించి తెలిసిందే. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్నది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇటు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపిన విషయం తెలిసిందే.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×