Trolls on Dil Raju : తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు రీసెంట్గా మీడియాలో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవటమే కాదండోయ్.. ఏకంగా ట్రోల్ అవుతున్నాయి. అది కూడా దిల్రాజుని ట్రోల్ చేస్తున్నది తెలుగు వాళ్లు కాదండోయ్ తమిళ తంబీలు. అసలు విషయంలోకి వెళితే, రీసెంట్ ఇంటర్వ్యూలో దిల్రాజు వారసుడు సినిమా గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన దళపతి విజయ్ హీరోగా దిల్రాజు, శిరీష్ నిర్మిస్తోన్న భారీ మూవీ వారిసు (తెలుగులో వారసుడు). సంక్రాంతికి సినిమాను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
వారసుడు సినిమా రిలీజ్ గురించి ఇంటర్వ్యూలో దిల్రాజు మాట్లాడే సందర్భంలో తమిళనాడులో అజిత్ కంటే దళపతి విజయ్ నెంబర్ వన్ హీరో అనేశాడు. అంతటితో ఆగకుండా అజిత్ కంటే విజయ్కే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉందంటూ కూడా కామెంట్స్ చేశాడు. దీంతో దిల్ రాజుపై అజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ హీరోకి ఉన్న ఫ్యాన్స్ బేస్ గురించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. మీడియా ఏదో అడిగితే తాను కంట్రోల్ తప్పి మాట్లాడేనని దిల్ రాజు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రేపు తమిళనాడులో వారిసు సినిమా రిలీజైన తర్వాత అజిత్ ఫ్యాన్స్ సినిమాను ఎలా ఆడేసుకుంటారోనని ఆయనలో తెలియని టెన్షన్ మొదలైంది.