Sai Durgha Tej Photos: మెగా ఫ్యామిలీ ఎప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అందులో సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ కూడా ఒకరు. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు ఈ యంగ్ హీరో.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు అందించారు.
తాజాగా సాయి దుర్గతేజ్.. విజయవాడలో పర్యటించి అక్కడ ఉన్న అమ్మ అనాథాశ్రమానికి తన విరాళం అందజేశారు.
విజయవాడలో పర్యటన సమయంలో సాయి దుర్గతేజ్ ముందుగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు.
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్నవారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
అమ్మ అనాథశ్రమానికి రూ.2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు రూ.3 లక్షల రూపాయల విరాళం అందించారు.
అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్.. చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు.
మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి.
మెగా హీరోల్లో సాయి దుర్గతేజ్ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్కు మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ ఆయన మంచి మనసుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.