EPAPER

CM Chandrababu: ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. బోట్లు వదిలింది వైసీపీ వాళ్లే.. చంద్రబాబు

CM Chandrababu: ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర..  బోట్లు వదిలింది వైసీపీ వాళ్లే.. చంద్రబాబు

CM Chandrababu with flood victims and farmers: ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు వైసీపీ కుట్ర చేసిందని , అందుకే బోట్లు వదిలారని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏలూరు జిల్లాలో వరద బాధితులు, రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలకుల పాపాలు.. మనపాలిట శాపాలుగా మారాయన్నారు.


ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు వైసీపీ నాయకులు బోట్లు వదిలి పెను ప్రమాదం చేసేందుకు ప్రయత్నించారన్నారు. 50 టన్నుల బరువు ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయన్నారు. ఒకవేళ ప్రకాశం బ్యారేజీ కూలిపోయినట్లయితే లంక గ్రామాల పరిస్థితి ఎలా ఉండేదోనని ఆందోళన చెందారు. ఆ బోట్లతోనే గతంలో అక్రమ ఇసుక వ్యాపారం చేశారన్నారు.

వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్‌లు వస్తున్నాయని, వరదల సమయంలో వైసీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. గతంలో బుడమేరు గండ్లు పూడ్చకపోవడం వల్లే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చిందని, గత ప్రభుత్వం బుడమేరులో పూడిక తీయలేదని గండ్లు పూడ్చలేదని ఆరోపించారు.


అంతకుముందు, ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×