Gadwal : గద్వాల కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాలేజీ యాజమాన్యం అవమానించడంతో మనస్థాపంతో ఇంటర్ సెకండియర్ చదువుతున్న వెంకటేష్ ఆత్మహత్యకి ప్రయత్నించాడు.
పరిస్థితి విషమించడంతో కర్నూలులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాలేజీ యాజమాన్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ విద్యార్ధి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఫీజు విషయంలో కాలేజీ నిర్వహకులు విద్యార్ధిని అవమానించనట్టు తెలుస్తోంది. వాళ్ల మాటలతో మనస్థాపం చెందడంతోనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్నాడని సహచరులు చెబుతున్నారు.
మరోవైపు కళాశాల ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కొడుకు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.