EPAPER

Ex minister Dr lakshmareddy: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య మృతి

Ex minister Dr lakshmareddy: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య మృతి

Ex minister Dr lakshmareddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య డాక్టర్ శ్వేత మరణించారు. కొద్దిరోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో రాత్రి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కొద్ది గంటల వ్యవధిలో కన్నుమూశారామె. దీంతో లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం అలముకుంది.


హోమియోపతి డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఇంధన, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే లక్ష్మారెడ్డి భార్య చనిపోయారు. డాక్టర్ శ్వేత మరణం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.


 

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×