Demolition of Prakasam barrage gates: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనలో అరెస్ట్ చేసిన ఇద్దరినీ పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు.. పడవల యజమాని ఉషాద్రితోపాటు మరో వ్యక్తి రామ్మోహన్ కు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో నిందితులను పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
Also Read: అరరే.. ఒక్క పోస్ట్ తో జగన్ ఇలా బుక్కయ్యాడేంటి?
కాగా, ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను 4 పడవలు ఢీకొట్టిన విషయం విధితమే. పడవలు ఢీకొట్టడంతో 67, 69, 70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. అయితే, కొట్టుకొచ్చిన బోట్ల కోసం ఇప్పటివరకు దాని యాజమానులెవ్వరూ రాలేదు. ఈ ఘటనపై విచారణ జరపాలంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణను ప్రారంభించారు. పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఉంటే వాటిని దిగువకు వదలడంలో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పడవలపై పలు రంగులు ఉండడంతో రాజకీయ నేతల ప్రమేయం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.