Akkineni Naga Chaitanya: అన్నపూర్ణ స్టూడియోస్ లో దొంగలు పడ్డారు. పర్మిషన్ లేకుండా కొందరు నాగ చైతన్యను కలవడం కోసం గోడ దూకి మరీ .. లోపలి అడుగుపెట్టారు. ఇక వారిని చూసి షాక్ అయిన నాగ చైతన్య వారి మీద ఫైర్ అయ్యాడు. అసలు ఎవరు మీరు.. ఏం కావాలి అంటూ మండిపడ్డాడు. ఇదంతా చూసిన వెంటనే చై.. పోలీసులకు ఫోన్ చేయలేదా.. ? అంటే లేదు. అందుకు కారణం ఇదంతా ఒక సినిమా ప్రమోషన్ కాబట్టి.
ఓరీ మీ దుంపతెగ భయపెట్టేశారు కదరా.. ? అంటే నిజంగా అక్కడకు వచ్చిన టీమ్.. చైను అలానే భయపెట్టారు. ఇంతకు ఆ సినిమా ఏంటి అంటే.. చౌర్య పాఠం. ఇంద్ర రామ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకు ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని స్టోరీ అందిస్తుండగా.. నిఖిల్ గొల్లమర్రి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో ఇంద్ర రామ్ సరసన పాయల్ రాధాకృష్ణ నటిస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు నిర్మాతగా మారడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసమే నాగ చైతన్య వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు హైప్ ఇవ్వడానికి ఇలాంటి చిన్న చిన్న ప్రమోషన్స్ చేయడం ఇండస్ట్రీలో కొత్తేమి కాదు. అందులోనూ చౌర్య అంటే దొంగతనం కాబట్టి.. ఇలాదొంగలుగా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ దొంగల టీమ్.. చై దగ్గరకు ఎందుకు వచ్చారో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.
Team #ChauryaPaatam dug their way into Annapurna Studios to meet Yuva Samrat @chay_akkineni
What did #NagaChaitanya do next? pic.twitter.com/S9YZbmmbZr
— Vamsi Kaka (@vamsikaka) September 9, 2024