LG offered free services: భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. భారీగా వరదలు ముంచెత్తడంతో బాధితులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు వారిని ఆదుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇటు రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపార వేత్తలతోపాటు పలువురు ప్రముఖులు వరద బాధితులకు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి మనీని ట్రాన్సఫర్ చేస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ.. ఎల్జీ సంస్థ కూడా వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వరద బాధితులకు ఉచిత సేవలు అందిస్తామంటూ ప్రకటించింది.
ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఎన్టీఆర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరద భారీగా ముంచెత్తడంతో ఇళ్లలోని టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి ఉచిత సేవలు అందించేందుకు ప్రముఖ ఎల్జీ ఎలక్ట్రానిక్ సంస్థ ముందుకువచ్చింది. వరద నీటిలో తడిచిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉచితంగా సర్వీస్ అందిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా స్పేర్ పార్టులపై 50 శాతం డిస్కాంట్ కూడా ఇస్తామంటూ వెల్లడించింది. వరద బాధితులు తమ ఎల్జీ వస్తువులు పాడైతే తమను సంప్రదించాల్సిందిగా సదరు సంస్థ కోరింది. దీంతో వరద బాధితులకు కొంత ఊరట లభించనున్నది.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. సంచలన డాక్యుమెంట్స్ బయటపెట్టిన కాదంబరి జత్వానీ (వీడియో)