Actress Kadambari Jatwani Comments: ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పలు కీలక డాక్యుమెంట్లను బయటపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలి. నాతో కొంతమంది పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తించారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుని నాకు న్యాయం చేయాలి’ అంటూ ఆమె అన్నారు. ఇదిలా ఉంటే.. కాదంబరికి రాష్ట్ర మహిళా సంఘాలు మద్దతు ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వం, పోలీసులు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు జత్వానీ. అయితే, ఈ కేసులో తనపై సోషల్ మీడియాలో నీచ ప్రచారం చేస్తున్నారంటూ జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినవారికి శిక్షపడేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని తనకు న్యాయం చేయాలన్నారు. తనకు అండగా నిలుస్తున్న మహిళా సంఘాలకు కృతజ్ఞతలు అంటూ ఆమె పేర్కొన్నారు.
Also Read: ప్రేయసి, భార్య మధ్య చిచ్చుపెట్టి.. జంపైన దువ్వాడ
అనంతరం మహిళా సంఘాల లీడర్లు మాట్లాడుతూ.. ‘ఈ కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే ఈ కేసులో ఎవరెవరున్నారో అనేది బయటపడుతుంది. ఆ తరువాత వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ నటికి న్యాయం చేయాలని కోరుతున్నాం’ అంటూ వారు పేర్కొన్నారు.
ఈ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి
నాతో కొంతమంది పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. వాళ్లపై చర్యలు తీసుకోవాలి.
ఏపీలోని ఐపీఎస్ అధికారులపై నటి కాదంబరి జత్వానీ సంచలన వ్యాఖ్యలు.
కాదంబరికి అండగా నిలబడిన రాష్ట్ర మహిళా సంఘాలు.#KadambariJethwani #Ysrcp #YsJagan #APNews #NewsUpdates… pic.twitter.com/kFLJdUVXXo
— BIG TV Breaking News (@bigtvtelugu) September 9, 2024