Road accident in Karnataka’s Tumakuru district: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక తుమకూరు జిల్లా మధుగిరి తాలూకాలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. మరో కారులో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిందని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదంపై ఎస్పీ తుమకూరు అశోక్ కేవీ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: వినాయక చవితి వేడుకలు.. వాట్సాప్లో అలా చేశాడని స్కూల్ ప్రిన్సిపల్ అరెస్ట్, ఎక్కడంటే?
ఇదిలా ఉండగా, గత నెలలో కర్ణాటకలోని గడగ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.