EPAPER

Railway Station: రైల్వే స్టేషన్‌లో మంటలు.. దుకాణాలు దగ్దం.. ప్రయాణికుల పరుగులు

Railway Station: రైల్వే స్టేషన్‌లో మంటలు.. దుకాణాలు దగ్దం.. ప్రయాణికుల పరుగులు

Fire Accident: పశ్చిమ బెంగాల్‌లో ఓ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఒక షాపులో మొదలైన మంటలు ఇతర దుకాణాలకూ వేగంగా వ్యాపించాయి. చాలా వరకు షాపులు దగ్దమయ్యాయి. ఈ మంటలను చూసి ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగు పెట్టారు. ఈ ఘటన దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది.


గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ నెంబర్ 1 పైన ఉన్న ఓ షాపులో ఈ రోజు ఉదయం  10.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అవి వెంటనే ఇతర ప్లాట్ ఫామ్‌లపై గల దుకాణాలకు వ్యాపించాయి. అప్పుడు ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్‌లపై ఎదురుచూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ మంటల గురించి రైల్వే పోలీసులు, బ్రిగేడ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పే పనిలో పడ్డారు.

Also Read: RTC Bus: తీవ్ర విషాదం.. వాగు-రోడ్డు మధ్య వేలాడుతున్న ఆర్టీసీ బస్సు.. ఆర్తనాదాలు చేస్తున్న ప్రయాణికులు


రెండు అగ్నిమాపక యంత్రాలు స్పాట్‌కు వచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సియల్డా సౌత్ సెక్షన్‌ రైళ్ల సేవలు కొంత సేపు నిలిచిపోయాయి.

Related News

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Big Stories

×