Keerthy Suresh Photos: ప్రస్తుతం కేరళలో కేసీఏ క్రికెట్ లీగ్ జరుగుతోంది. కేవలం కేరళలోని ప్రాంతాల మధ్య జరుగుతున్న క్రికెట్ లీగ్ కావడంతో మాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దీనిని వీక్షించడానికి స్టేడియంకు వచ్చారు. అందులో కీర్తి సురేశ్ ఒకరు.
కేసీఏ లీగ్లో త్రివేండ్రం రాయల్స్ టీమ్కు సపోర్టర్గా, స్పాన్సర్గా వ్యవహరిస్తోంది కీర్తి సురేశ్.
తాజాగా కేసీఏలో త్రివేండ్రం రాయల్స్ మొదటి విజయాన్ని మూటగట్టుకుంది. ఆ సంతోషంలో పలు ఫోటోలను షేర్ చేసింది కీర్తి.
ఈ ఫోటోల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్తో పాటు మలయాళ స్టార్ మోహన్లాల్తో కలిసి సంతోషంగా కనిపించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కు చెక్ను అందజేసిన ఫోటోను కూడా కీర్తి సురేశ్ షేర్ చేసింది.
కేసీఏ క్రికెట్ లీగ్లో భాగమయిన ఇతర ముఖ్యమైన వ్యక్తులతో కూడా ఫోటోలు దిగి వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతానికి సినిమాలను పక్కన పెట్టి క్రికెట్ స్టేడియంకు తన గ్లామర్ను యాడ్ చేస్తుంది కీర్తి సురేశ్.
కేసీఏ క్రికెట్ లీగ్లో జరుగుతున్న దాదాపు ప్రతీ మ్యాచ్కు హాజరవ్వడం మాత్రమే కాకుండా అక్కడి ఫోటోలను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్తో పంచుకుంటోంది.