Navdeep wins Paris 2024 Paralympics javelin throw gold: పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగరి ఫైనల్ మ్యాచ్లో నవదీప్ సింగ్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ మేరకు నవదీప్.. 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు.
అయితే, తొలుత ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం దక్కించుకున్నాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీరట్లు విసిరినా నిర్వాహకులు ఆయనను డిస్ క్వాలిఫై చేయడంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్ను గోల్డ్ మెడల్ విజేతగా నిలిచారు. ఈ మేరకు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
భారత అథ్లెట్ నవదీప్ తొలుత రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.
కాగా, అంతకుముందు మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్యం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది.