Preliminary Estimate of flood damage in AP: ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదికను సిద్ధం చేసింది. ‘ఆర్అండ్ బీకి రూ. 2,164.5 కోట్లు, నీటి వనరుల శాఖకు రూ. 1568.5 కోట్లు, పురపాలక శాఖకు రూ. 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ. 750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ. 167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ. 157.86 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు 75.5 కోట్లు, ఉద్యానశాఖకు రూ. 39.9 కోట్లు, పశుసంవర్థశాఖకు రూ. 11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ. 2 కోట్లు’ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు.
Also Read: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?