Duvvada Issue: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం గురించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నది. వారి ఇష్యూలో ఇప్పటికే ఓ ఇల్లు వివాదాస్పదంగా మారింది. అయితే, ఆ వివాదాస్పద ఇంటికి మాధురి చేరుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది.
Also Read: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!
ఆ ఇంటి ఆవరణలో దాదాపుగా నెల రోజుల నుంచి నిరసన తెలుపుతున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, బిడ్డలు.. ఈ విషయం తెలిసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి మళ్లీ ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఆ ఇంటి వరండాలోనే వాణి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.