AP CM Chandrababu Naidu Vinayaka Chavithi Wishes to Telugu People: వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తొలిపూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నానని సీఎం ట్వీట్ చేశారు. వాడవాడలు చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు..విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయని సీఎం అన్నారు.
వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలూ ప్రయత్నాలు చేస్తున్నామని.. ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహా గణపతిని కోరుకుంటున్నానట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు..
Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు.. దయచేసి వాటి జోలికి వెళ్లకండి
అలానే మంత్రి లోకేష్ సైతం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే గణనాథుడు ఆశీస్సులతో.. మీ జీవితంలో సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. వరద నష్టాలు, కన్నీటి కష్టాలు విఘ్నాధిపతి అనుగ్రహంతో తొలగిపోయి.. ఆయురారోగ్యాలతో ఆనందమయంగా అందరూ జీవించాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.