Mangampeta Glimpse: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు , కొత్త హీరోలు, కొత్త కథలు అని లైట్ తీసుకోవడానికి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీ.. ఏ పుట్టలో ఏ పాము ఉందో అనే సామెతను గుర్తుచేసుకొనేలా ఉంది. చిన్న సినిమాలే కదా అని లైట్ తీసుకుంటే.. కొత్తవారు, కొత్త కథలతో మంచి మంచి హిట్స్ ను అందుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఇలాంటి కొత్త కథలకు ఢోకా లేదు.
తాజాగా మరో కొత్త కథతో కొత్తవారు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చంద్రహాస్ కే, అంకిత సాహా జంటగా గౌతం రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మంగంపేట. భాస్కర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద గుంటక శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలోనే వవిడుదలకు సిద్దమవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ‘ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?..’, ‘కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా..’, ‘చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..’,‘రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్దం కాదు.. శివ తాండవం..’ అంటూ తల్లి కొడుకుల మధ్య జరిగే సంభాషణ మధ్యలో యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు.
విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరో చంద్రహాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే మాస్ ఆడియెన్స్కు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి.మంగంపేట టెక్నికల్గానూ హై స్టాండర్డ్లో ఉంది. కెమెరామెన్ ఈ మూవీ కోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్, మ్యూజిక్ ఢైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మాస్ ఆడియెన్స్కు సరికొత్త ఎక్స్పీరియెన్స్ ఇచ్చేలా ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.