Warangal : వరంగల్ నగరంలో వింత చోరీ జరిగింది. ఇంటిముందు పార్క్ చేసి ఉన్న కారును రాత్రికి రాత్రే క్రేన్ సాయంతో ఎత్తుకెళ్లారు దుండగులు. ములుగురోడ్ హనుమాన్ జంక్షన్లో ఉంటున్న జైపాల్ రెడ్డికి చెందిన ఈ కారును ఈ నెల 8 వ తేదీన ఎత్తుకెళ్లారు. క్రేన్తో లిఫ్ట్ చేసి ఆటోనగర్ తీసుకెళ్లి.. దాన్ని తుక్కుగా మార్చేసారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులకు సంబంధించిన ఆధారాలు లభించాయి. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దొంగలే ఇలా చేశారా.. లేక ఎవరైనా కక్షతో ఇలా చేశారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.