PM Modi: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక నమూనా అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ స్వయంగా సింగపూర్లను సృష్టించుకుంటోందని తెలిపారు. సింగపూర్ లారెన్స్ వాంగ్ తో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే సింగపూర్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్ఫూర్తి అని తెలిపారు. భారత్లో అనేక సింగపూర్ లను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధానిగా లారెన్స్ బాధ్యతలు చేపట్టిన తొలిసారి భేటీ అయినట్లు మోదీ గుర్తు చేశారు. యువ నాయకత్వంలో సింగపూర్ మరింత పురోగతి సాధిస్తుందని ఆకాంక్షించారు.
విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లిన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాను పెంపొందించుకునేందుకు ఆ దేశ ప్రధాని లారెన్స్ తో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత నాలుగు కీలక ఒప్పందాలపై కూడా మెదీ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.