JP Nadda: కేసీఆర్ తీరు.. ఉట్టికి ఎగురలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానన్నట్టు ఉందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిందని.. ఆ తర్వాత ఇక వీఆర్ఎసే నంటూ సెటైర్లు వేశారు.
తాను కరీంనగర్ సభకు వచ్చే మార్గంలో బీఆర్ఎస్ శ్రేణులు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని.. ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు విశ్వాసం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు గుడ్ బై చెప్పే సమయం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని నడ్డా ఆరోపించారు. కేసీఆర్ కూతురును లిక్కర్ స్కాంలో విచారణకు పిలవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కేసీఆర్ చెప్పగలరా అని నిలదీశారు. కేసీఆర్ సర్కారును గద్దె దించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని.. అందుకే అంతా బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు.