Hyderabad : హైదరాబాద్ డంపింగ్ యార్డ్లో పేలుడు జరగడంతో చిత్తు కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఉన్న విషయం తెలిసిందే. అనేక మంది పారిశుధ్య కార్మికులు ఆ డంపింగ్ యార్డ్లోకి వెళ్లి వస్తుంటారు.
ఈ క్రమంలో అక్కడ తండ్రీ కొడుకులు, చంద్రన్న, సురేశ్..చిత్తు కాగితాలు ఏరుకోవడానికి డంపింగ్ యార్డ్లోకి వెళ్లారు. అప్పుడే అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చింది ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిని వారు కర్నూలుకు చెందిన చంద్రన్న ఆయన కుమారుడిగా కనుగ్గొన్నారు.