Edupayala Vana Durga Matha Temple: మంజీరా వరద ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని తాకింది. మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో భక్తులెవరూ ఆలయానికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. మొక్కులను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. గర్భగుడిని మూసివేశారు.
మంజీరాకు వరద పోటెత్తడంతో.. అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేశారు. ఏ క్షణానైనా ఆలయానికి వరద తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో ఆలయానికి భక్తుల రాకను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.