Vyjayanthi Movies: ఏపీలో భారీ వర్షాల వలన ఎంతోమంది నిరాశ్రుయులు అయిన విషయం తెల్సిందే. కొన్ని ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. ఇక వరద బాధితులకు అండగా ఇండస్ట్రీ ఎప్పుడు ఉంటుంది అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఆయ్ సినిమా యూనిట్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
నేటి నుంచి ఈ వారం మొత్తం ఆయ్ మూవీకి వచ్చే కలెక్షన్లలో నిర్మాత షేర్లోని 25 శాతాన్ని జనసేన పార్టీ తరుపున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.ఇకఇప్పుడు వైజయంతీ మూవీస్ బ్యానర్ కూడా తమ వంతు విరాళాన్నీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.
“వైజయంతీ మూవీస్ బ్యానర్.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సహాయ నిధికి సహాయ నిధికి రూ. 25,00,000/- విరాళంగా ఇస్తున్నాము. ఈ రాష్ట్రం మాకు చాలా ఇచ్చింది. మరియు ఈ సవాలు సమయంలో తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని మేము భావిస్తున్నాము. ఈ చిన్న సాయం దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు సమాజాల పట్ల ప్రేమతో మరియు గౌరవంతో రూపొందించబడిందని మేము నొక్కిచెప్పాలనుకుంటున్నాము, మేము ఒకరికొకరు మద్దతుగా ఐక్యంగా నిలబడతాము. రేపటి కోసం” అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది వైజయంతీ మూవీస్.. కల్కి సినిమాతో ప్రేక్షకుల ముదనకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ రికార్డ్ కలక్షన్స్ అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం వైజయంతీ మూవీస్ వరుస సినిమాలతో బిజీగా మారింది.
Let's strive for a better tomorrow.@AndhraPradeshCM pic.twitter.com/AvneI83YAo
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 2, 2024