Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిన సాయి పల్లవి.. తన వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. గ్లామర్ ను ఒలకబోయకుండా.. పద్దతిగా కథలను ఎంచుకుంటూ లేడీ పవర్ స్టార్ గా ఎదిగింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి ప్రేమ, పెళ్లి గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా.. అది సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఎప్పటినుంచో సాయి పల్లవి పెళ్లి చేసుకొని, సినిమాలకు బ్రేక్ ఇస్తుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అందులో నిజం లేదని ఎప్పటికప్పుడు సాయి పల్లవి నిరూపిస్తూనే ఉంది.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి.. తన మనసులోని మాటను బయటకు చెప్పింది. ఆమె ప్రేమించే వ్యక్తి ఎవరో చెప్పుకొచ్చింది. ” మహాభారతం అంటే నాకు చాలా ఇష్టం. దానిమీద ఎంతో గౌరవం కూడా ఉంది. అందులో అర్జునుడు కుమారుడు అభిమన్యుడు అంటే నాకు చాలా ఇష్టం. గత 17 ఏళ్లుగా అభిమన్యుడు గురించి అన్ని విషయాలను తెలుసుకుంటున్నాను. పదేళ్లుగా నేను ఆయనను ప్రేమిస్తూ వస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
కల్కి సినిమా తరువాత అభిమన్యుడు గురించి అర్జునుడు గురించి యువత తెలుసుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇక వీరికన్నా ముందే సాయి పల్లవి అభిమన్యుడు ప్రేమలో పడడం ఆశ్చర్యమని చెప్పుకొస్తున్నారు. తన లైఫ్ లో అభిమన్యుడు లాంటి భర్త దొరకాలని ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక సాయి పల్లవి సినిమాలు గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం తెలుగులో ఆమె తండేల్ సినిమాలో నటిస్తోంది. ఇక తమిళ్ లో అమరన్ చేస్తుండగా.. హిందీలో రామాయణంలో నటిస్తుంది. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.