Jagan and Vijayamma: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 15వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా పులివెందులలోని ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు.
సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వైఎస్ఆర్ వైఫ్ విజయమ్మ, తనయుడు, మాజీ సీఎం జగన్, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.
రాయలసీమకు చెందిన వైఎస్ఆర్ బంధువులు, వైసీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. అలాగే కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పాలనను గుర్తు చేసుకున్నారు.
ALSO READ: విజయవాడ వరదలు మూడు లక్షల మందిపై ప్రభావం..
ఘాట్ వద్ద జగన్.. తన తండ్రికి నివాళులు అర్పిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిస్ యు డాడ్ అంటూ చిన్న క్యాప్షన్ ఇచ్చేశారు. అనంతరం పులివెందులలో తన నివాసం వద్ద ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం పులివెందుల నుంచి రోడ్ మార్గంలో తాడేపల్లికి చేరుకోనున్నారు మాజీ సీఎం జగన్. మంగళవారం ఆయన విదేశాలకు వెళ్లనున్నారు.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచే నేతగా వైఎస్సార్ లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదన్నారు. భౌతికంగా వైఎస్ఆర్ మన మధ్య లేకపోయినా, ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉన్నారని, నాన్న ఆశయాలే తనను చేయి పట్టి నడిపిస్తున్నాయని వెల్లడించారామె.
దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ప్రజల గుండెల్లో చిరకాలం చెరగని సంతకం చేసిన గొప్పనేత వైఎస్సార్. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా నాన్న మన మధ్య లేకపోయినా..… pic.twitter.com/0LEZEadLdA
— YS Sharmila (@realyssharmila) September 2, 2024