TGPSC: టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ -3 పరీక్షను రాసే అభ్యర్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది. గ్రూప్ -3 దరఖాస్తుల సవరణకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవొచ్చంటూ అందులో పేర్కొన్నది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులు ఆయా దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవాలంటూ సూచించింది.
Also Read: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే
ఇదిలా ఉంటే.. సివిల్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు అండగా నిలిచింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను వారికి పంపిణీ చేసి అండగా నిలిచిన విషయం తెలిసిందే. సచివాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అభ్యర్థులకు చెక్కులను పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం రూ. లక్ష చెక్కులను పంపిణీ చేసిన విషయం విధితమే.