IAS Officers Transferred: పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అదేవిధంగా మరికొంతమంది ఆఫీసర్లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానంను ప్రభుత్వం బదిలీ చేసి.. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆ బాధ్యతలను తఫ్సీర్ ఇక్బాల్ కు అదనంగా అప్పగిస్తూ ఉత్వర్వుల్లో పేర్కొన్నది.
Also Read:మీరు హుస్సేన్ సాగర్కు వెళ్తున్నారా..? అయితే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్న్యూస్ మీ కోసమే..
షేక్ యాస్మిన్ బాషా – మైనార్టీ సంక్షేమ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు
కె. సరేంద్ర మోహన్ – గనుల శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు
టి. వినయ్ కృష్ణారెడ్డి – భూసేకరణ, పునరావాస కమిషనర్ గా అదనపు బాధ్యతలు
నిర్మల కాంతి వెస్లీ – మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు
జి. మల్సూర్ – రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు
మహ్మద్ అసదుల్లా – వక్ఫ్ బోర్డు సీఈఓగా నియామకం
పి. శ్రీజ – ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.