Rain alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, శుక్రవారం రాత్రి అది ఏపీ, ఒడిషా తీరాల వైపు కదులుతోంది.
ఆదివారం ఉదయం నుంచి అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు గంటలకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఊదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని పేర్కొంది. శనివారం నుంచి నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.
ALSO READ: ఎస్డీఎఫ్ నిధులు, పనులు నిలిపివేయడం దుర్మార్గం: హరీశ్ రావు
గతరాత్రి నుంచి హైదరాబాద్తోపాటు మిగతా ప్రాంతాల్లో వర్షాలుపడ్డాయి. వాతావరణ శాఖ వార్నింగ్ తో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 5 సెంటిమీటర్లు, వరంగల్ జిల్లా-4, భదాద్రి కొత్తగూడెంలో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఉమ్మడి కృష్ణా జిల్లా, విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. విజయవాడ, విశాఖలోని ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. ఇక కృష్ణారావుపాలెం-కేశ్యాతండా మధ్య వాగులో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులోని వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
వరదలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు
పల్నాడు జిల్లా: అచ్చంపేట ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద.
అచ్చంపేట-మాదిపాడుకు నిలిచిన రాకపోకలు.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు.#HeavyRains #Palnadu #APSRTCbus #AndhraPradesh… pic.twitter.com/ZRpDXOnOD6
— BIG TV Breaking News (@bigtvtelugu) August 31, 2024