EPAPER

Harish Rao: ఎస్డీఎఫ్ నిధులు, పనులు నిలిపివేయడం దుర్మార్గం: హరీశ్ రావు

Harish Rao: ఎస్డీఎఫ్ నిధులు, పనులు నిలిపివేయడం దుర్మార్గం: హరీశ్ రావు

– పూర్తి కావొస్తున్న పనుల బిల్లులనూ నిలిపివేశారు
– ఇది ముమ్మాటికీ అభివృద్ధిని అడ్డుకునే కుట్రే
– కాంగ్రెస్ పక్షపాత ధోరణికి నిదర్శనం
– ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు


హైదరాబాద్, స్వేచ్ఛ: ప్రతిపక్షంపై కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని, రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అంటూ ఫైరయ్యారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు రూ.10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టిందన్న ఆయన, రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంజూరైన అనేక పనులను నిలిపివేయడంతో పాటు, ఇప్పటికే ప్రారంభమైన పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించొద్దని మధ్యంతరంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారంటూ మండిపడ్డారు. దాదాపు పూర్తి కావొస్తున్న ప్రాజెక్టులకు సైతం బిల్లుల చెల్లింపులు నిలిపివేయడం కరెక్ట్ కాదన్నారు.

దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల తదితర శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్పారు. ‘‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియకు ఆటంకం కలిగింది. దీంతో ఎంతోమంది ఉపాధి కూడా కోల్పోతున్నారు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక అజెండాతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నది. ఈ ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తి సామర్థ్యాలు లేవని ఇప్పటికే తేలిపోగా, మంజూరైన పనులను పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని పనుల రద్దుతో స్పష్టమైంది. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారింది. అభివృద్ది నిరోధకులుగా ముఖ్యమంత్రి వ్యవరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గాలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. ఈ నిధుల నుండే మార్చి నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు ఇచ్చి తన కురచ బుద్ధిని, పక్షపాత ధోరణిని చూపింది.


Also Read: Yadadri: మన గుట్ట మెరవాలి..!

కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలపై కక్షతో ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం దుర్మార్గం. నిధులు కేటాయించకపోగా పురోగతిలో ఉన్న పనులకు సైతం నిధులు నిలిపివేయడం మరో దుర్మార్గం. ఇప్పటివరకు రద్దు చేసిన ఎస్డీఎఫ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయిలో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. జిల్లా కలెక్టర్లు, అధికారులు సైతం రద్దు చేసిన పనులకు సంబంధించి ఎలాంటి సమీక్ష జరపలేదు. కనీసం పురోగతిలో ఉన్న పనుల నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంలో విఫలమయ్యారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, తన అనాలోచిత చర్యలతో తన ఆనవాలునే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ పూరిత రాజకీయాలు చేయడం పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని హితవు పలికారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×