మొత్తానికి లెజండ్స్ క్రికెట్ లీగ్ లోకి శిఖర్ ధావన్ తో పాటు దినేశ్ కార్తీక్ కూడా వెళ్లడం హాట్ టాపిక్ గా మారిపోయింది. మాజీ స్టార్ క్రికెటర్లు వెళ్లడంతో లెజండ్స్ లీగ్ పై అంచనాలు పెరిగాయి. దీంతో జనాల్లో ఆసక్తి కూడా పెరిగింది. అయితే వీరిద్దరిని ఎంతకి కొనుగోలు చేశారనేది తెలీదు. అయితే 2024 సెప్టెంబరు 20 నుంచి లెజండ్స్ లీగ్ ప్రారంభం కానుంది.
ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. అందులో సదరన్ సూపర్ స్టార్ట్స్ జట్టుకి దినేష్ కార్తీక్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇకపోతే భారత్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఎంతో మంది లెజండ్స్ లీగ్ లో ఆడటం విశేషం. ఆనాటి లెజండరీ క్రికెటర్లు మళ్లీ గ్రౌండులో సత్తా చాటితే చూడాలని ఉందని అభిమానులు పేర్కొంటున్నారు.
లెజండ్ లీగ్స్ లో పాల్గొనే జట్ల పేర్లు ఏమిటంటే.. సౌత్ సూపర్ స్టార్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, కోణార్క్ సూర్యాస్ ఒడిశా, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్. మరికొద్ది రోజుల్లో ఇంకొంతమంది మాజీ స్టార్ క్రికెటర్లు ఆడనున్నారని అంటున్నారు.
Also Read: 26 ఏళ్లకే.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
ఈ సందర్భంగా భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ లెజండ్స్ లీగ్ లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. ఇంకా తనలో క్రికెట్ ఆడే సత్తా ఉందని అన్నాడు. మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
ఏదైనా మాలాంటి వాళ్లకు.. క్రికెట్ ఆడటంలోనే ఆనందం ఉందని అన్నాడు. అదే మా ఊపిరి, అదే మా జీవితం, అదే మా సర్వస్వమని తెలిపాడు. శరీరం సహకరించే వరకు ఆడేందుకే ఇష్టపడతానని అన్నాడు. అయితే ఇన్నాళ్లూ నన్ను అభిమానించిన, ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలని తెలిపాడు. మళ్లీ మిమ్మల్ని అలరించేందుకు మైదానంలో అడుగుపెడుతున్నట్టు తెలిపాడు.