Viral Video: ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ కళ. ఎంతో ఘనంగా, ఎవ్వరు కనీవిని ఎరుగని తీరులో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. ఈ తరుణంలో పెళ్లి సంబంధాలు చూసే సమయం నుంచే పెళ్లి చూపుల నుంచి మొదలుకుని, పెళ్లి తంతు ముగిసే వరకు ఎలా చేయాలి, ఏంటి అని ప్లాన్లు వేస్తుంటారు. ఈ తరుణంలో ఫోటోల నుంచి మొదలుకుని, పెళ్లి మండపం, బాజా బజంత్రీలు, ఇలా అన్నింటిలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్నేహితులు, బంధువులు, ఇఱుగుపొరుగు వారు అందరినీ పిలిచి ఎంతో వైభవంగా పెళ్లి వేడుకను జరుపుకుంటారు. అయితే ఇందులో ముఖ్యంగా ఫోటో షూట్స్ పై ఇటీవల చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఏదో ఒక వినూత్నత ఉండాలని కోరుకుంటున్నారు.
అందరి పెళ్లిళ్ల మాదిరి కాకుండా తమ పెళ్లిళ్లో ఏదో ఒక వింత ఉండాలని ఆలోచిస్తూ వినూత్న చర్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వధువరులు చేసిన వినూత్న ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. వధువరులు ఇద్దరు కలిసి ఫోటో షూట్ చేయాలని అనుకున్నారు. ఈ తరుణంలో ఏదో ఒక వినూత్నత ఉండాలని అనుకుని దాని కోసం చాలా వింత ప్రయత్నం చేశారు.
ఇద్దరు వధువరులు కలిసి రాకెట్ పై ప్రయాణం చేసినట్లు ఉండేలా ఓ వీడియోను చిత్రీకరించారు. వీడియోలో ఓ పెద్ద రాకెట్ తీసుకుని దానిపై వధువరులు ఇద్దరు కూర్చున్నారు. వారి వెనకాల వారి స్నేహితులు అందరు కలిసి ఉన్నారు. అయితే ఒక దానితో మంట వెలిగించి దానిని రాకెట్ కు నిప్పంటించారు. దీంతో రాకెట్ అమాంతం గాల్లోకి ఎగిరినట్లు దానిపై వధువరులు ఇద్దరు కూర్చుని ఉన్నట్లు వీడియోను చిత్రీకరించారు. అయితే దీనిని చూస్తే నిజమైన రాకెట్ అనే భావన కలిగేలా చేశారు. కానీ ఇది ఒక ఎడిటెడ్ వీడియో. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది.
India is not for beginners 😜 pic.twitter.com/9YX3Ap3yaj
— Professor (@Masterji_UPWale) August 24, 2024