IND vs BAN: మొదట్లో టకటకా అవుట్ అయ్యారు. మధ్యలో బాగానే ఆడారు. మళ్లీ చివర్లో పెవిలియన్ కి క్యూ కట్టారు. బంగ్లాదేశ్, ఇండియా తొలి టెస్టు మ్యాచ్ లో తొలిరోజు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది టీమిండియా. పుజారా, శ్రేయస్ లు రాణించగా.. పంత్ పర్వాలేదనిపించాడు.
మొదటి రోజు మ్యాచ్ మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా.. 90 పరుగుల దగ్గర పుజారా అవుటయ్యాడు. 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 రన్స్ చేసి పెవిలియన్కు చేరాడు. 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ కి అక్షర్ పటేల్ (14) సైతం అవుట్ కావడంతో.. 278 రన్స్ తో తొలిరోజు మ్యాచ్ ముగిసింది.
ఓపెనర్లు కేఎల్ రాహుల్ 22, శుభ్ మన్ గిల్ 20, విరాట్ కోహ్లీ 1 పరుగుకే అవుట్ కాగా.. రిషభ్ పంత్ 46 రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, మెహిదీ 2, ఖలిద్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.