Nirmala Seetharaman : ఆశించిన స్థాయికంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. విపత్తు పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని.. ప్రతిపక్షాలు రాద్దాంతం మాని… సలహాలు, సూచనలు చేయాలని ఆమె తెలిపారు.
రైతుల కోసం ఎరువుల కొరత లేకుండా జాగ్రత్త పడ్డామని… పేదల గ్యాస్ సిలిండర్ రాయితీ కొనసాగిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లోక్సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు చర్యల వల్లే దేశాభివృద్ధి వేగంగా సాగుతుందని నిర్మల సభలో పేర్కొన్నారు.