HYDRA Notices To Marri Rajasekhar Reddy Colleges: బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా, రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు.
చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కాలేజీల నిర్మాణాలను చేపట్టారని, దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.