Earthquake in srikakulam: శ్రీకాకుళం జిల్లాను భూ ప్రకంపనలు వణికించాయి. ఇచ్చాపురం పరిసరాల్లో తెల్లవారుజామున మూడు గంటల 40 నిమిషాలకు ఒకసారి, నాలుగు గంటలకు మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు మూడు సెకన్ల సేపు కంపించినట్టు ప్రజలు చెబుతున్నారు.
ప్రజలు భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నమాట. గతంలో ఈ విధంగా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
రెండుసార్లు ప్రకంపనలు రావడంతో అధికారులు దృష్టి సారించారు. దీనికి సంబంధించి త్వరలో వెల్లడిస్తామన్నారు. రెండేళ్ల కిందట కూడా ఇదే విధంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా భయంతో ప్రజలు వణికిపోయారు. గడిచిన 60 ఏళ్లలో ఇలాంటి భూ ప్రకంపనలు చూడలేదని అంటున్నారు స్థానికులు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో భూకంపం
ఇచ్చాపురం పరిసరాల్లో తెల్లవారుజామున 3 గంటలకు ఒకసారి, 4 గంటలకు మరోసారి కంపించిన భూమి.#EarthQuake #Srikakulam #AndhraPradesh #NewsUpdates #Bigtv pic.twitter.com/Pgg6TCWtQA
— BIG TV Breaking News (@bigtvtelugu) August 28, 2024