Kavitha Stepped out from jail: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఐదున్నర నెలల తరువాత ఆమె తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదైలన తరువాత కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ’18 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. నేను ఎన్నో ఎత్తు పళ్లాలు చూశాను. కానీ, నన్ను అక్రమంగా జైలుకు పంపారు. నేను మొండిదానిని, జైలుకు పంపి నన్ను ఇంకా జగమొండిని చేశారు. ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో చెల్లిస్తా. నా పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉన్నాను. ఒక తల్లిగా పిల్లలను ఐదున్నర నెలలు వదిలి జైలులో ఉండడం బాధాకరం. కష్టకాలంలో నాకు, నా కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు.
Also Read: రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ..
నన్ను ఈ స్థితికి తీసుకువచ్చిన వారికి తగిన గుణపాఠం చెబుతాను. ఆ సమయం త్వరలోనే రాబోతున్నది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోను. వారికి వడ్డీతో సహా చెల్లిస్తా. నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. రాజకీయ క్షేత్రంలో పోరాడుతాను. చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా. క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతో పనిచేస్తా’ అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.