Mathu Vadalara2: జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే అనే పాటతో అందరి హృదయాల్లో తన నవ్వును పదిలంగా పెట్టేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్ తో ఓవర్ నైట్ లోనే ఫరియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
జాతిరత్నాలు తరువాత ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా చిట్టి అనే పిలుస్తున్నారు. అయితే ఈ చిన్నదానికి జాతిరత్నాలు తరువాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి కానీ, విజయాలు మాత్రం దక్కలేదు. ఈ మధ్యనే కల్కి సినిమాలో ఒక చిన్న ఫ్రేమ్ లో మెరిసిన ఫరియా.. ఒక లక్కీ ఛాన్స్ ను పట్టేసింది.
కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా పరిచయమైన మత్తు వదలరా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల తరువాత మత్తు వదలరా కు సీక్వెల్ ప్రకటించిన విషయం తెల్సిందే. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ముఖ్యంగా శ్రీ సింహా, సత్య కామెడీ ట్రాక్ ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని సమాచారం. మొదటి పార్ట్ లో హీరోయిన్ లేదు. అయితే ఈసారి ఈ చిత్రంలోకి ఫరియా అడుగుపెట్టింది. తాజాగా ఫరియా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేస్తూ.. ఆమెను చిత్రబృందంలోకి ఆహ్వానించారు. నిధి అనే పాత్రలో ఫరియా కనిపించనుంది.
ఇక ఈ పోస్టర్ లో చిట్టి.. చేతిలో గన్ పట్టుకోని లేడీ పోలీస్ ఆఫీసర్ లుక్ లో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. చిట్టి లుక్ ను బట్టి.. నేరస్తుల దుమ్ము దులిపేలానే కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మత్తు వదిలిస్తుందో.. ఎక్కిస్తుందో.. ? చూడాలి. కనీసం ఈ సినిమాతోనైనా చిట్టి మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
The talented @fariaabdullah2 joins the gang as 'Nidhi' ❤️🔥
Get ready for explosive laughs & thrills on the big screens 💥💥💥
Teaser out soon…#MathuVadalara2 in cinemas on 13th September, 2024.
A @RiteshRana sequel.#MV2 @Simhakoduri23 #Satya @kaalabhairava7 @ClapEntrtmnt… pic.twitter.com/aJ4dHYyIfV
— Mythri Movie Makers (@MythriOfficial) August 27, 2024