వైసీపీ నేత ప్రదీప్రెడ్డి ట్వీట్పై అనూహ్యంగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ఎగ్ పఫ్లు బాగా తిన్నారు.. బిల్లు బాగా పెరిగిందని స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ ప్రదీప్ రెడ్డి.. హీరో సాయిధరమ్ తేజ్ మధ్య ట్వీట్ వార్ నడిచింది. గత వైసీపీ ప్రభుత్వ ఎగ్ పఫ్ల బిల్లు కోట్లలో వచ్చిందని.. ఇటీలే టీడీపీ ఆరోపణలు గుప్పించింది. దాన్ని ప్రస్తావిస్తూ తేజ్ రిప్లై ఇచ్చారు.
అన్న క్యాంటీన్ల ఏర్పాటును, భోజనం నాణ్యతను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై జగన్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రుచి, శుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అయినా జగన్, వైసీపీ నాయకులు విమర్శలు చేయం విడ్డూరంగా ఉందన్నారు లోకేశ్. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి.. వీడియోలు తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: ముంబై హీరోయిన్ని వేధించిన వైసీపీ నేతలు.. ఆ రాత్రి ఏం జరిగింది?
వైసీపీ నేతలు పోస్ట్ చేసిన వీడియో, మంత్రి లోకేశ్ కౌంటర్ ఓకే. మరి, తణుకు అన్న క్యాంటీన్లో ఏం జరుగుతోంది? డర్టీ వాటర్లో ప్లేట్లు కడుగుతున్నారా? శుచి, శుభ్రత లేదా? ఈ విషయంపై బిగ్టీవీ ఫ్యాక్ట్చెక్ చేసింది. ఆ డీటేల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు.
BIG TV FACT CHECK
తణుకు అన్న క్యాంటీన్ ఘటన పై బిగ్ టీవీ ఫాక్ట్ చెక్..
చేతులు కడుక్కున్న అపరిశుభ్రత నీటితో ప్లేట్లు కడుగుతున్నారంటూ వైసీపీ ప్రచారం..
అపరిశుభ్ర నీటితో ప్లేట్లు కడగలేదని, తిన్న అనేక ప్లేట్లు దాంట్లో పడేస్తే వాటిని తీసే క్రమంలోనే ఫోటోలు వీడియోలు తీశారని… pic.twitter.com/HtxWYpAeav
— BIG TV Breaking News (@bigtvtelugu) August 27, 2024