Revanth Reddy : రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చాడు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యాలయం పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపించకుండా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న మీరు పోలీసులా లేక దొంగలా అని ప్రశ్నించారు.
ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. అల్లరిమూకల్లా వ్యవహరించి పోలీసులు దాడులు చేస్తున్నారన్నారు. ఇది ఆటవికం, అనాగరికం అని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు.