EPAPER

Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

Dance by 350 artistes.. an international record at Mantralayam: ఆదివారం మంత్రాలయంలో జరిగిన భరత నాట్య ప్రదర్శన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం, చెన్నరాయపట్నం హాసన్ కు చెందిన జాతీయ సంప్రదాయ నృత్య అకాడమీ కలిస ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలో 350 మందికి పైగా భరతనాట్య కళాకారిణులు పాల్గొన్నారు. ఈ వేదికపై ఆదివారం సాయంత్రం అందరూ కలిసి ఏక కాలంలో నృత్యాభినయం చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ఆశీస్సులతో ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ నాట్య ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి నాట్య కళాకారిణులు పాల్గొనడం విశేషం. దాదాపు 15 నిమిషాల పాటు రామ నామ గీతాలు ఆలపిస్తూ సాగిన ఈ దృశ్య వేడుక అహూతులను అలరించింది.


వివిధ దేశాలనుంచి..

వివిధ దేశాలనుంచి వచ్చిన కళాకారిణులు భారత శాస్త్రీయ నృత్యాన్ని అత్యంత శ్రద్ధతో చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎక్కడో జర్మనీ, జపాన్, ఇండోనేషియా దేశాలనుంచి ఈ కళాకారులు రావడం విశేషం. మంత్రాలయంలో నిర్వహిస్తున్న 353వ సప్త రాత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. వారంరోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలనుసర్వ సమర్పణతో ముగింపు పలికారు పీఠాధిపతి.


Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×