Tapsi pannu coments on photographers viral..Iam not public property : 2010లో ఝుమ్మంది నాదం మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను. న్యూఢిల్లీలోని జాట్ సిక్కు కుటుంబంలో జన్మించింది తాప్సీ. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారింది. అయితే వివాదాస్పద అంశాలలో తాప్సీ ముందుంటుంది.ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. టాలీవుడ్ సినిమా దర్శకులు ఎక్కువగా హీరోయిన్లను ఎక్స్ పోజ్ చేస్తుంటారని బొడ్డు, నడుము మాత్రమే చూపిస్తారంటూ అప్పట్లో తాప్సీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అయితే ఇటీవల తాప్సీ నటించిన మూవీకి సంబంధించి స్పెషల్ షోను ఓ థియేటర్ లో వేశారు. అయితే మీడియాకు సంబంధించిన ఫొటోగ్రాఫర్లు ఒక్కసారిగా తాప్సీని చుట్టుముట్టారు.
తాప్సీ వార్నింగ్
ఓ ఫొటోగ్రాఫర్ అయితే ఏకంగా తాప్సీ మొహం మీదే కెమెరా పెట్టేశాడు. దానితో తాప్సీ అసహనానికి గురయింది. వెంటనే సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చేసింది. మీద పడకండి అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. గతంలోనూ చాలా సందర్భాలలో ఫొటోగ్రాఫర్ల మీద చిరాకు పడింది తాప్పీ. ఇటీవల ఇదే విషయంపై స్పందించింది. నేను కూడా అందరి ఆడపిల్ల లాంటిదాన్నే..నేను నటిని..ఫొటోగ్రాఫర్లంతా మీద పడిపోవడానికి నేనేమీ పబ్లిక్ ప్రాపర్టీని కాదు. నటిని కాకపోయివుంటే ఓ అమ్మాయిని. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అందుకే ఈ ఫీల్డ్ కి వచ్చాను. నేను నా వృత్తిని గౌరవిస్తాను..ప్రేమిస్తాను. మీద పడిపోయి ఫొటోలను తీయడం నాకు నచ్చదు.
తాప్సీ పద్దతి మార్చుకో
ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.మీరు నాకు మర్యాద ఇస్తే నేను కూడా మీకు మర్యాద ఇస్తా..నన్ను ఫిజికల్ గా హ్యాండిల్ చేయడం ఏమిటి? నాపై అరవడమేమిటి? నేనేమీ పబ్లిక్ ప్రాపర్టీని కాను అంటోంది తాప్సీ. ఈ మధ్య తాప్సీ ఫొటోగ్రాఫర్లపై దురుసుగా మాట్లాడటం వైరల్ గా మారింది వీడియో. తాప్సీ ఫొటోగ్రాఫర్ల విషయంలో అలా చేయడం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లకు ఫ్రీగా పబ్లిసిటీ కావాలి కానీ..కెమెరామెన్లు పనికిరారా? తాప్సీ పద్దతి మార్చుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.