Babumohan met Chandrababu: ప్రస్తుతం రాష్ట్రంలో ఓ అంశంపై భారీగా చర్చ జరుగుతోంది. అదేమంటే.. బాబూ మోహన్ టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి బాబూమోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్ కు వచ్చి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకున్నది. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందువరకు బీజేపీలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ప్రజాశాంతి పార్టీలో చేరారు. కాగా, గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబూమోహన్ తాజాగా చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: చంద్రబాబు కీలక నిర్ణయం.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరంటే..?
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలంటూ ఆయన.. నాయకులకు సూచించారు. ఇటు పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు. పనితీరు బాగున్నవారికే పార్టీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసిన విషయం విధితమే.