Viral Video: ఎవరి జీవితంలో అయినా ఓ సొంతిళ్లు అనేది కళ లాంటిది. ఎంతో అందంగా ఉండే ఇళ్లును నిర్మించుకోవాలని ఆశపడుతుంటారు. ప్రస్తుతం ఉన్న కాలంలో యువత చదువుతున్న సమయం నుంచే సొంతింటి కళలు కంటున్నారు. బాగా సంపాదించి ఎన్నో అంతస్తుల ఇళ్లు కట్టుకోవాలని అనుకుంటారు. అయితే ఈ క్రమంలో కొన్ని గుంటలు, లేదా ఎకరాల స్థలం కొని పెట్టుకుంటారు. అనంతరం అందులో ఇళ్లు నిర్మించాలని కనీసం రెండు లేదా మూడు అంతస్తుల ఇళ్లు అయినా నిర్మించాలని అనుకుంటారు. అయితే తాజాగా ఓ కుటుంబం ఆస్తి పంపకాల్లో వింత ఘటన వెలుగుచూసింది. ఆస్తి పంపకం చేయగా కొడుకులకు వచ్చిన ఆస్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో సంపాదించి పెడుతుంటారు. వారు పెరిగిన తర్వాత వారికంటూ కొంత ఆస్తులు, భూమి, ఇళ్లు, డబ్బులు ఉండాలని జీవితాంతం కష్టపడి వారిని చదివించి పెద్దవారిని చేస్తారు. కానీ ఒకానొక సమయంలో వారు మరణించిన తర్వాత ఆస్తి పంపకాలు చేసుకుంటారు. వాటి కోసం తగాదాలు, కొట్లాటలు, హత్యలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు తరచూ ఎన్నో వెలుగుచూస్తున్న క్రమంలో ఓ కుటుంబంలో జరిగిన ఆస్తి పంపకాల ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఆస్తి పంపకాల్లో ఓ వ్యక్తికి వచ్చిన స్థలంలో కోపంతో కట్టాడో లేక ఇష్టంగానే కట్టాడో తెలీదు. కానీ రెండు అడుుగల స్థలంలో రెండు ఫ్లోర్లు నిర్మించాడు. అతడు ఉద్యోగ రీత్యా ఇంజినీర్. ఈ క్రమంలో తనకు ఆస్తి పంపకాల్లో వచ్చిన రెండు అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవైన స్థలంలో ఎలాగైనా సరే ఇళ్లును నిర్మించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అసలు రెండు అడుగుల స్థలంలో ఇళ్లు కాదు కదా, చిన్న గది కూడా నిర్మించలేము. అలాంటిది ఆ వ్యక్తి ఏకంగా రెండస్తుల ఇళ్లును నిర్మించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇళ్లును చూస్తే అది నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ వీడియో చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. దీనిని చూసిన నెటిజన్లు కూడా అందరూ షాక్ అవుతున్నారు.
View this post on Instagram