Bangladesh Muslims Protect Temple| బంగ్లాదేశ్ల్ లో ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత.. దేశంలోని హిందువులపై, హిందూ దేవాలయాలపై అల్లరి మూకలు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని పురాతన ఢాకేశ్వరి దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన అల్లరి మూకలను స్థానిక హిందువులు, ముస్లింలు అడ్డుకున్నారు.
ఆ ప్రదేశంలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో దేవాలయాన్ని సులువుగా కూలదోయొచ్చని భావించిన మతోన్మాద యువకులతో స్థానిక ముస్లింలు పోరాడారు. హిందూ- ముస్లిం ఐక్యతకు నిదర్శనకు ప్రతీకగా ఉన్న ఈ దేవాలయాన్ని తాము కాపాడుకుంటామని గుడి పూజారికి స్థానిక ముస్లింలు హామీ ఇచ్చినట్లు పూజారి తెలిపారు.
ఈ ఘటన గురించి ఢాకేశ్వరి గుళ్లో పనిచేసే పూజారి ఆషిమ్ మైత్రో వివరించారు. ”ఢాకేశ్వరి మందిరం చుట్టూ చాలా మసీదులన్నాయి. ఎన్నో దశాబ్దాల నుంచి మసీదు నుంచి వచ్చే అజాన్ పిలుపుతో పాటు దేవాలయ పూజార్చనల ధ్వనుల శబ్దాలు మనశ్శాంతినిస్తున్నాయి. ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు చాలా స్నేహ పూర్వకంగా నివసిస్తున్నారు. ఆ ఢాకేశ్వరి తల్లి సమస్త మానవాళికి తల్లి. ఆ రోజు దేవాలయాన్ని నాశనం చేయడానికి చాలామంది ఉద్రేక యువత వచ్చినప్పుడు వారిని అడ్డుకనేందుకు స్థానికంగా నివసించే హిందువులు, ముస్లింలు అందరూ కలిసి పోరాడారు. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వారు ఆ రోజు లేకపోతే దేవాలయంలో వినాశనం సృష్టించేందుకు అల్లరి మూకలు సిద్ధంగా కనిపించాయి. నేను భయంతో ఆ తల్లిని వేడుకుంటూ ఉండిపోయాను. అల్లరి మూకలు.. స్థానికుల నుంచి వ్యతిరేకత చూసి తిరిగి వెళ్లిపోయారు.” అని పూజారి చెప్పారు.
Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నోబెల్ అవార్డు గ్రహీత మొహమ్మద్ యూనుస్ నాయకత్వంలో ఒక ఆపధర్మ ప్రభుత్వం ఏర్పడింది. నిజానికి దేశంలో మిలిటరీ పాలన నడుస్తున్నా.. పరిపాలనా బాధ్యతలు యూనుస్ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. హిందూ దేవాలయాలకు సంరక్షన కల్పిస్తామని, హిందువులు, మైనారిటీలను కాపాడుతామని యూనుస్ ఇటీవల ప్రకటించిన తరువాత.. పరిస్థితి మెరుగుపడింది.
గత రెండు నెలలుగా బంగ్లాదేశ్ లో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి షేక్ హసీనాని బలపూర్వకంగా ఆమె పదవి నుంచి తప్పంచి.. మిలిటరీ పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం దేవాలయాలు, చర్చిల లో నిత్యపూజలు, ప్రార్థనలు పున:ప్రారంభమయ్యాయి. మరి కొన్ని రోజుల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరుగకుండా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు కల్పిసామని హామీ ఇచ్చింది.